Clsr

Recent Posts

లక్ష్మీ కటాక్షం కావాలా ??


'ధనమున కల్గు సత్ఫలము ధారుణి మర్మములన్‌ గ్రహింపగన్‌' అన్నాడు ఒక మహానుభావుడు. ప్రపంచంలో బతకాలంటే ధనసముపార్జన తప్పని సరి. ధర్మచింతనతో నలుగురికి సాయపడాలన్నా ధనవంతుడైవుండాలి. ఒకనాడు డబ్బు లేక పోయినా అనేక మార్గాల్లో మానవుడు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అన్నిటికీ డబ్బు కావాలి. ఇది ఎవరికీ తెలియంది కాదు. అయితే డబ్బును సంపాదించ డానికి మనిషి పడేపాట్లు అన్ని ఇన్ని  కాదు. డబ్బు ఆర్జించడం కోసం చేయని ఉద్యోగం లేదు, వేయని  ఉపాయం లేదు. మనిషి  ప్రయత్నమంతా  డబ్బు కోసమే. ఐశ్వర్యాభివృద్ధి కోసం కుబేర పూజను చేస్తే ఐశ్వర్యం, అభివృద్ధి ఒకేసారి దక్కుతుంది.. లక్ష్మి ధనకనకాధులు, అదృష్టం, సౌందర్యా లనిచ్చే దేవత. లక్ష్మి కృపాకటాక్షం లేకుండా ఏది చేసినా అది వృధా.  ధనానికి మరో అధిపతి కుబేరుడు. ఉత్తరం దిక్కు వైపు ప్రతినిధి అయిన కుబేరుడు భూ మండలంలోని ఆగర్భంలో ఉన్న సమస్త నిధి నిక్షేపాలకూ యజమాని..పురాణ లలో తెలిపినట్టు అతి శ్రీమంతుడు అనిపించుకున్న శ్రీ వెంకటేశ్వరస్వామి కూడా కుబేరుని వద్ద తీసుకొన్న అప్పుకు వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉన్నాడు. లక్ష్మి పూజను భారత దేశమంతటా వివిధ రకాలుగా ఆచరిస్తున్నారు. లక్ష్మి కుబేర పూజ ను ఒకే సారి కలిపి నెరవేర్చినపుడు వారిరువురినుండి దొరికే ఆశీర్వాదం, శ్రేయస్సు, ద్విముఖమై పేదరికం, దారిద్య్రాలు దూరం అవుతాయి. లక్ష్మి కుబేరుల ఆరాధనను సులభంగా ఆచరించడానికి సామాన్య మంత్రా లను ఈ కింద ఇవ్వడమైంది. కుబేర, లక్ష్మీ మంత్రాలు వేరు వేరుగా దొరుకుతాయి. వాటిని పూజా గదిలో దేవుని ముందు ఎర్ర రంగులోని వస్త్రం పై ఉంచి దీప-ధూపాలతో పూజించాలి. ఓపికను బట్టి సాధ్యమైతే నిత్య నైవేద్యం కోసం ఏదైనా తీపి లేదా, తేనె, లేదా నెయ్యి చెక్కెరను సమర్పించవచ్చు. శంఖం దొరికితే దాన్ని దేవుని పీఠం ముందు ఉంచి షోడ షోపచారాలతో పూజించడంవల్ల అష్టై శ్వర్యాలు సిద్ధించును. లక్ష్మీ మంత్రం: - ఓం శ్రీ హ్రీం క్రీం లక్ష్మీ దేవ్యై నమ: కుబేర మంత్రం:-- యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనాధిపతయే ధనధాన్య“సమృద్ధియే మేహి దాపయ స్వాహా! పై రెండు మంత్రాలనూ రోజుకు కనీసం 108 సార్లు చొప్పున తొమ్మిది నెలలు జపిస్తే సిరులపంట పండుతుంది. పేదవారికి ఉన్నంతలో దానధర్మాలు చేస్తూవుండాలి.